హైకోర్టు న్యాయవాది హత్య కేసులో కొత్త విషయాలు

  • రూ.10 లక్షల సుపారీతో న్యాయవాది మొయినుద్దీన్ హత్య  
  • వినయ్ గ్యాంగ్‌తో హత్యకు ఒప్పందం కుదుర్చుకున్న కిషన్
  • కారుతో ఢీకొట్టి 20 మీటర్లు లాక్కెళ్లి కిరాతకంగా హత్య
  • హత్య వెనుక వక్ఫ్ భూముల వివాదం ఉన్నట్లు అనుమానం
తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది రూ.10 లక్షల సుపారీ ఇచ్చి చేయించిన హత్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిషన్ అనే వ్యక్తి ద్వారా వినయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ముఠాతో ఈ హత్యకు ఒప్పందం కుదిరినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ హత్య కోసం నిందితులు ఆరు నెలల క్రితమే సెకండ్‌హ్యాండ్‌ కారును కొనుగోలు చేశారు. న్యాయవాది కదలికలపై చాలాసార్లు రెక్కీ నిర్వహించారు. చివరకు ఆయన ఇంటి వద్దే కారుతో ఢీకొట్టి, సుమారు 20 మీటర్ల దూరం లాక్కెళ్లి కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి.

వక్ఫ్ భూముల వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన తర్వాత నిందితులు గోవా, కల్వకుర్తికి పారిపోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Khaja Moinuddin
Telangana High Court Advocate
Advocate Murder Case
Waqf Land Dispute
Hyderabad Crime
Supari Killing
Vinay
Telangana Police
Crime News Hyderabad

More Telugu News